ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కే.ఎస్. శ్రీనివాస్ రాజును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ రాజు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.