Visakhapatnam Tirupati Vande Bharat: ఏపీలో కొత్తగా వందేభారత్ ఎక్స్ప్రెస్ల అంశం తెరపైకి వచ్చింది. ఈ మేరకు లోక్సభలో ఏపీకి చెందిన ఎంపీలు ప్రస్తావించారు.. కొత్తగా వందేభారత్ రైళ్లను నడపాలని కోరారు. ఈ మేరకు రెండు రూట్లలో కొత్త రైళ్లను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. కొత్తగా నెల్లూరు నుంచి తిరుపతి మీదుగా మైసూరుకు వందేభారత్ రైలును నడపాలని కోరారు. అలాగే తిరుపతి విశాఖపట్నం మధ్య వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభించాలని కూడా రిక్వెస్ట్ చేశారు.