Andhra Pradesh Bullet Train Project: ఆంధ్రప్రదేశ్ గుండా బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. చెన్నై నుండి మైసూరు వరకు 463 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు మార్గాన్ని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 77 కిలోమీటర్ల మేర పలమనేరు, బంగారుపాళ్యం మీదుగా రైలు మార్గం వెళ్లనుంది. పలమనేరు దగ్గర ఒక స్టాపింగ్ ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు 41 గ్రామాల పరిధిలో భూసేకరణ పనులు చేస్తున్నారు.