Andhra Pradesh Cm Chandrababu Security Tightened: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేయడానికి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్తో సీఎం సమీక్షించారు. భద్రతా నియమాలు పక్కాగా అమలు చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.