మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. తెలంగాణ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్ డిబేట్లో ఫోన్ ఇన్ ద్వారా పాల్గొన్న రేణుకా చౌదరి.. వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో జగన్ తీరును తప్పుబడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రేణుకా చౌదరి వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.