ఒంగోలు గిత్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలంటూ మంత్రి నారా లోకేష్ వద్దకు ప్రతిపాదన చేరింది. సురేష్ అనే వ్యక్తి ఒంగోలు గిత్తను ఏపీ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని మంత్రి నారా లోకేష్ను కోరారు. దీనిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. అలాగే ప్రభుత్వంతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒంగోలు గిత్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే.