ఆంధ్రప్రదేశ్లో జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన లోక్ అదాలత్ అపూర్వ విజయం సాధించింది. ఒక్కరోజే 60,953 కేసులను పష్కారం కాగా.. రూ.109.99 కోట్ల పరిహారం చెల్లింపునకు అవార్డులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 381 లోక్ అదాలత్ బెంచ్లు శనివారం నాడు రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించాయి. జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్లో 108 కేసులు పరిష్కారం కాగా.. రూ.2.05 కోట్ల పరిహారం అందజేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..