Ration Rice With Only 10% Broken Rice In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేసే రేషన్ బియ్యంలో ఇకపై నూకలు 10 శాతమే ఉంటాయి. ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పేదలకు అందిస్తోంది. సెప్టెంబరు 1 నుంచి 17 జిల్లాల్లో పంపిణీ మొదలుపెట్టారు. వచ్చే నెలలో 20 జిల్లాలకు విస్తరించనున్నారు. అలాగే 10శాతం నూకలతో స్టీమ్ రైస్ పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.