Andhra Pradesh Rs 55 Crores For Tobacco Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొగాకు రైతులకు శుభవార్త తెలిపింది. 2024-25 రబీ సీజన్లో మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన బర్లీ పొగాకు నిధులను విడుదల చేసింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలలోని 4,040 మంది రైతుల ఖాతాల్లో రూ.54.88 కోట్లు జమ చేసింది. బర్లీ పొగాకుకు సరైన ధర లేకపోవడంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. త్వరలో తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో పెండింగ్ డబ్బులు జమ చేస్తారు.