Chandrababu Naidu On Farmers Crop Damage: ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పంట నష్టం అంచనా వేసి వెంటనే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. పిడుగుపాటుకు చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, కేంద్రంతో మాట్లాడి అదనపు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.