Andhra Pradesh Farmers Drones 80 Percent Discount: రైతులకు వ్యవసాయంలో సహాయపడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్లను సబ్సిడీపై అందిస్తోంది. 80% సబ్సిడీతో రైతు గ్రూపులకు డ్రోన్లు ఇస్తున్నారు. దీని ద్వారా పురుగు మందులు పిచికారీ చేయడం, విత్తనాలు వేయడం సులభమవుతుంది. కూలీల కొరతను అధిగమించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయొచ్చు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ డ్రోన్ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.