Annadata Sukhibhava Scheme: ఏపీలోని రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపిక గడువు పొడిగించారు. లబ్ధిదారుల ఎంపిక గడువు మే 20తో ముగియగా.. మే 25 వరకూ పొడిగించారు. అర్హులైన రైతులు సంబంధిత పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే వీలుందని అధికారులు చెప్తున్నారు.