ఏపీ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కందిపప్పు సేకరణ గడువు పొడిగించింది. మరో 15 రోజుల పాటు సేకరణ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీస మద్దతు ధర కింద ఈ పదిహేను రోజులు కూడా రైతుల నుంచి ప్రభుత్వం కందిపప్పు సేకరిస్తుంది. జూన్ 26 వరకు కందిపప్పు సేకరణ గడువు పొడిగించినట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గడువు పొడిగించాలన్న రాష్ట్ర అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.