Andhra Pradesh Farmers Paddy Procurement Rates: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఖరీఫ్ సీజన్లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. గతంలో కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే రైతులకి డబ్బులు చెల్లించామని గుర్తు చేశారు. ఈసారి కొనుగోలు కేంద్రాలను వారం ముందుగానే ప్రారంభిస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.