AP Govt Pay Rs 800 To Farmers For Urea Reduce Usage: యూరియా అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గిస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ప్రతి బస్తా యూరియా తగ్గించినందుకు రైతులకు రూ. 800 ఆర్ధిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తక్కువ యూరియా వాడితే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు.