Ap Fact Check Team On Chandrababu Warn Farmers Video: ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కొందరు కావాలనే యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతుల ముసుగులో వైకాపా కార్యకర్తలు గొడవలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎరువులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు యూరియా వాడకం తగ్గించాలని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయాలు వాడాలని సూచించారు. తప్పుడు వార్తలు రాసే వారిపై ప్రభుత్వం సీరియస్గా ఉంటుందని హెచ్చరించారు.