Rythu Nestham Awards 2025: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది శుభవార్త! వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులను సత్కరించేందుకు రైతునేస్తం పురస్కారాలు 2025 అందజేయనున్నారు. ఆసక్తి గలవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు. మరోవైపు ఐఏఎస్ అధికారి మద్దిరాల నాగరాజుకు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం లభించనుంది. ఈ నెల 10న తెనాలిలో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది.