Chandrababu Review On Aqua: అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు. ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి 11 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల్లోని ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంతో సంప్రదించి సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.