AP Government Scholarships for BC Students: ఏపీలోని బీసీ విద్యార్థులకు మంత్రి సవిత గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థలలో చదువుతున్న బీసీ, ఓబీసీ, డీఎన్టీ విద్యార్థులకు పీఎం యశస్వి పథకం కింద రూ.90.50 కోట్లు ఉపకార వేతనాలు మంజూరు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. ఆర్థిక కారణాలతో విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే రాష్ట్రంలో బీసీ హాస్టల్స్, గురుకులాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వివరించారు.