AP Government viluvala vidya books to Students: ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇటీవల తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పేరుతో పాఠ్యపుస్తకాలు, షూలు, వంటివి విద్యార్థులకు అందించిన ప్రభుత్వం.. తాజాగా మరో ఆలోచన చేసింది. విద్యార్థులలో నైతిక విలువను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విలువల విద్య పుస్తకాలను అందించాలని నిర్ణయం తీసుకుంది.