AP Government fee reimbursement funds: రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసింది. రూ.600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. మొదటి విడతగా ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేశామని.. ఇప్పుడు మరో రూ.600 కోట్లు.. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.