Andhra University Dual Degree Course: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విశాఖపట్నం ఏయూ శుభవార్త తెలిపింది. స్వీడన్లోని బ్లెకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి డ్యూయల్ డిగ్రీ కోర్సును అందిస్తోంది. తక్కువ ఖర్చుతోనే విదేశాల్లో ఇంజినీరింగ్ చదివే అవకాశం కల్పిస్తోంది. ఈసీఈ, సీఎస్ఈ విద్యార్థులకు స్వీడన్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. చదువు పూర్తయిన తరువాత స్వీడన్లో ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.