ఏపీ వినాయక నిమజ్జనాలలో విషాదం.. ఏడుగురు మృతి

6 months ago 11
గణేశ శోభాయాత్ర విషాదాంతంగా ముగిసింది. ట్రాక్టర్‌ అదుపు తప్పిన ఘటనలో.. బాలుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నిమజ్జనోత్సంలో పాల్గొన్నవారిపైకి స్కార్పియో దూసుకురావడంతో ఇద్దరు కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో ఆదివారం రాత్రి గణేశ శోభాయాత్ర నిర్వహించారు. యాత్ర కొనసాగుతుండగా మధ్యలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ 2 నిమిషాలు విశ్రాంతి తీసుకునేందుకు కిందకు దిగారు. ఈ లోగా ఓ యువకుడు అత్యుత్సాహంతో ట్రాక్టర్‌ నడిపేందుకు ప్రయత్నించగా అది అదుపుతప్పి ముందు ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తిరుమల నరసింహమూర్తి, గురుజు మురళి, కడియం దినేశ్‌, ఈమన సూర్యనారాయణ మరణించగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు మండలం చింతలవీధి కూడలిలో.. వినాయక విగ్రహ నిమజ్జనోత్సవం నిర్వహిస్తుండగా జాతీయ రహదారిపై అరకు వైపు నుంచి ఫుల్ స్పీడ్‌లో వేగంతో వచ్చిన ఎస్‌యూవీ అక్కడ థింసా నృత్యం చేస్తున్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్‌ కొర్రా సీతారామ్‌, గుండ కొండబాబు అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో, ట్రాక్టర్ అదుపుతప్పి జనసందోహంపైకి దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో మారుతి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Entire Article