అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. అల్లూరి జిల్లాకు చెందిన 26,835 మంది గిరిజన విద్యార్థులు విశాఖలో ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాదవ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యోగా గురువు శ్రీనివాస్ విద్యార్థుల చేత ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డుల ప్రతినిధుల పర్యవేక్షణలో జరిగింది.