ఏపీవాసులకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం కల్పించింది. దీంతో ఏపీలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించనుంది. ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరం రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించే ఈ కొత్త విధానాన్ని తీసుకురానుంది. తాజాగా నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీని ఆమోదించారు.