AP High Court Verdict On Ab Venkateswara Rao: ఏపీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును, ఛార్జ్ షీట్ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై కేసు నమోదు చేశారు. తనపై కేసును కొట్టివేయాలని వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు తీర్పును వెల్లడించింది.