Vangalapudi Anitha Humanity: ఏపీ హోంమంత్రి రోడ్డు మార్గంలో శ్రీశైలం బయల్దేరి వెళుతున్నారు ఈ క్రమంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ దగ్గర బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని చూసిన హోంమంత్రి అనిత వెంటనే కాన్వాయ్ ఆపి.. బాధితుల దగ్గరకు వెళ్లారు. గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు చేసిన తర్వాత వెంటనే వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి పెద్ద మనసుతో చేసిన సాయాన్ని అందరూ అభినందించారు.