Chittoor Apsrtc First Cng Bus: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్యాన్ని నివారించేందుకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరు ఆర్టీసీ డిపోలో డీజిల్ బస్సును సీఎన్జీ బస్సుగా మార్చారు. రాష్ట్రంలోనే ఇది మొదటి ప్రయత్నం. దీని ద్వారా పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని ఆర్టీసీ భావిస్తోంది. మరోవైపు చిత్తూరు ఆర్టీసీ కార్గో సేవలు ప్రజలకు చేరువ అవుతూ ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు.