APSRTC Health Check Up For Staff Above 45 Years: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కల్పించింది. ఆర్టీసీలో 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ హెల్త్ చెకప్ అమలును తప్పనిసరి చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకొకసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. మే 1 నుంచి ఈ కార్యక్రమం అన్ని డిపోల్లోనూ అమలులోకి రానుంది. ఆర్టీసీ ఎండీ ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.