Apsrtc To Get 1450 New Electric Buses: ఏపీ ప్రభుత్వం ఆర్టీసీకి తీపీకబురు చెప్పింది. మరో 1,450 విద్యుత్ బస్సుల్ని సమకూర్చుకునేందుకు అనుమతించింది. ఈ బస్సుల కోసం త్వరలోనే ఆర్టీసీ టెండర్లు పిలవనుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ బస్సులు నడపనున్నారు. కేంద్రం నుంచి ఇప్పటికే 1050 విద్యుత్ బస్సులు కేటాయించగా.. అదనంగా మరో 1450 బస్సుల్ని తీసుకురానున్నారు. విద్యుత్ బస్సులతో పాటుగా సీఎన్జీ బస్సుల్ని కూడా తీసుకురావాలని భావిస్తోంది.