ఏపీఎస్ఆర్టీసీ వినూత్న విధానం అమలు చేస్తోంది. అటు ప్రయాణికులకు, ఇటు సంస్థకు ఇద్దరికీ ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉండేలా ఏపీఎస్ఆర్టీసీ ఈ విధానం అమలు చేస్తోంది. కన్వర్షన్ విధానం ద్వారా మరో ఐదేళ్లు గడువు ఉన్న సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మారుస్తున్నారు. వీటిని పలుచోట్ల అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో ప్రయాణికులకు మరిన్ని పల్లె వెలుగు బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి.