మన దేశంలో రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం 'భీష్మ' పేరుతో పోర్టబుల్ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు భీష్మ యూనిట్లను కేటాయించింది. ఇది ఒక చిన్న ఆసుపత్రిలా పనిచేస్తుంది. దీని ద్వారా క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందించవచ్చు. మరి ఇది ఎలా పని చేస్తుంది.. దీనిలో ఏమేం యూనిట్స్ ఉంటాయి వంటి వివరాలు మీకోసం..