APSRTC To Get New Electric Buses: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త తెలిపింది. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఏపీఎస్ఆర్టీసీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. రాష్ట్రంలోని 11 నగరాల్లో ఈ బస్సులు తిరుగుతాయి. పుణెకు చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ వీటిని నడుపుతుంది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ సిద్ధమైంది. మూడు నెలల్లో బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. డీజిల్, సీఎన్జీ బస్సులకు బదులు ఎలక్ట్రిక్ బస్సులనే కొనాలని ప్రభుత్వం యోచిస్తోంది.