Andhra Pradesh Indias Largest Renewable Energy Complex: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రూ.22 వేల కోట్లతో భారీ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విక్రమ్శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును నెలకొల్పనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్గా అవతరించనుంది. మంత్రి నారా లోకేష్ దీనికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.