Andhra Pradesh Rs 80 Thousand Crore Oil Refinery Soon: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండగా.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రూ.80 వేల కోట్ల ఆయిల్ రిఫైనరీ రాబోతోందని శుభవార్త తెలిపారు. ఈ మేరకు ఆయన రిఫైనరీపై స్పందించారు. అయితే ఇది గతంలో ప్రకటించిన బీపీసీఎల్ రిఫైనరీనా లేదా కొత్త ప్రాజెక్టునా అనేది తెలియాల్సి ఉంది.