ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ.10,600 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో 50 వేల గదులు, 10 వేల హోంస్టేలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి, అన్నవరం వంటి ప్రాంతాలను వివాహ వేదికలుగా మార్చడంతో పాటు, బౌద్ధ స్థలాలను అభివృద్ధి చేయడమే కాక 100 ఆలయాల్లో టెంట్ సిటీలు అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు.