Steel plant at nakkapalli andhra Pradesh: ఏపీలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.70000 కోట్లతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు నవంబర్ నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇది కేవలం ఆరంభమేనని.. త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తామని నారా లోకేష్ వివరించారు.