Andhra Pradesh Reliance Bio Gas Plant: ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ సంస్థ రాష్ట్రంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు ప్రకాశం జిల్లాలో రిలయన్స్ కంపెనీ సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి దీనిని ఏర్పాటు చేయనున్నారు. మంత్రి నారా లోకేశ్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు.