AP Weather Today: ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తిరుమలలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.