AP Weather Today: రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగగా, పార్వతీపురం జిల్లా వీరఘట్టంలో అత్యధికంగా 64.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, గుజరాత్, విదర్భ ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.