Andhra Pradesh Senior Citizen Card 2025 Apply: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన పురుషులకు, 58 ఏళ్లు నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వీటిని గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాల్లో పొందవచ్చు. ఏలూరు జిల్లాలో 1.32 లక్షల మంది అర్హులు ఉండగా, కేవలం 18,781 మంది మాత్రమే ఈ కార్డులు తీసుకున్నారు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.