Andhra Pradesh Anganwadi Workers Good News: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మంది వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించారని.. అలాగే మట్టి ఖర్చుల కోసం రూ.15 వేలు ఇస్తామని.. అంగన్వాడీల జీతాలు పెంపుపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.