Andhra Pradesh Weather High Temperatures Today: ఆంధ్రప్రదేశ్లో మార్చిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చాడు. గత కొద్ది రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి దెబ్బకు రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. రోజురోజుకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. మార్చిలోనే 40డిగ్రీలకు చేరింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా గొడుగు, టోపీ, రుమాలు వినియోగించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.