ఏపీలో ఆ ఉద్యోగులకు ప్రమోషన్లు.. మార్చి నాటికి నివేదిక..!

6 months ago 21
గ్రామ సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి త్వరలోనే తీపికబురు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రుల బృందంతో భేటీ అయ్యారు. గ్రామ సచివాలయాల నిర్మాణం, గ్రామ సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల అంశంపై చర్చించారు. వీటి మీద పూర్తిస్థాయిలో అధ్యయనం జరిపి మార్చి నాటికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article