Guntur Tirupati Express Madanapalle Extended: ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. గుంటూరు-తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 25 నుంచి మదనపల్లె క్రాస్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ రైలు సేవలు జులై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, యశ్వంత్పూర్-యోగ్ నగరి రిషికేశ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైళ్లు ప్రతి గురు, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.