Andhra Pradesh Government Starts P4 From August 19: ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఆగస్ట్ 19 నుంచి ఏపీలో పీ-4 కార్యక్రమం అమలు కానుంది. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పీ-4 కార్యక్రమం కింద ఇప్పటికే మార్గదర్శులు, బంగారు కుటుంబాల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకూ సుమారుగా లక్ష మంది మార్గదర్శులను, 9 లక్షల 37 వేల బంగారు కుటుంబాలను ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అయితే మార్గదర్శుల ఎంపికలో బలవంతం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.