Visakhapatnam To Salur New Train: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు రైల్వే స్టేషన్కు ట్రయల్ రన్ జరిగి ఏడాది దాటినా రైలు సేవలు ప్రారంభం కాలేదు. కరోనా సమయంలో నిలిపివేసిన రైలు బస్సు సేవలు కూడా పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ, విజయనగరం వంటి నగరాలకు వెళ్లేవారికి ప్రత్యామ్నాయాలు లేక ఆందోళన చెందుతున్నారు. వెంటనే రైలు సేవలు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.