Andhra Pradesh Mango Farmers Rs 160 Crores: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రైతులందరికి శుభవార్త తెలిపింది. త్వరలో రూ.160 కోట్ల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 25 మధ్య 37 వేల మంది రైతులకు ఈ సబ్సిడీ అందుతుంది. తోతాపురి మామిడిని 4.10 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, రైతులకు సక్రమంగా చెల్లింపులు చేయని ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.