Rajahmundry Railway Station Rs 271 Crore Funds Released: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు మంజూరు చేసింది. అయితే టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో పనులు ప్రారంభం కాలేదు. తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమైన ఈ స్టేషన్ను అభివృద్ధి చేయాలని, పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ఎంపీ పురందేశ్వరి రైల్వే అధికారులను కోరారు. స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలు, అదనపు ప్లాట్ఫారమ్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.