Pedana Vissannapeta National Highway Bypass: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి కనెక్టివిటీని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి మచిలీపట్నం పోర్టుకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పెడనకు తూర్పు వైపున కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణం కానుంది. పెడన-విస్సన్నపేట రోడ్డును జాతీయ రహదారిగా మార్చి, తెలంగాణలోని కల్లూరు వరకు నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే మచిలీపట్నం పోర్టుకు రవాణా మరింత సులభమవుతుంది.